Andhra PradeshHome Page Slider

పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్

Share with

పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. సిట్టింగ్‌ ఎంపీ, కడప అభ్యర్థి అవినాష్‌రెడ్డితో కలిసి జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి పత్రాలు సమర్పించారు. సోమవారం పులివెందులకు చెందిన స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు అధికార పార్టీ అధినేత తరపున నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. మే 13న అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ దాఖలకు ముందు CSI గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ, మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి తన చెల్లెల్లపై విరుచుకుపడ్డారు. షర్మిల, సునీత పేర్లను ప్రస్తావించకుండా వివేకా హంతకులు, వైఎస్ రాజశేఖరరెడ్డిపై కుట్రదారులతో చేతులు కలిపారని జగన్ మండిపడ్డారు. వివేకానందరెడ్డిని ఎవరు చంపారో జిల్లా మొత్తానికి తెలుసునని అన్నారు. వివేకాకు రెండో భార్య, బిడ్డ ఉన్న సంగతి కూడా ప్రజలకు తెలుసని జగన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే దివంగత వైఎస్ఆర్ మరణానంతరం ఆయన పేరును చార్జిషీట్‌లో చేర్చారని దుయ్యబట్టారు.