NationalNews

ఎలక్ట్రిక్‌ వాహనాలపై నిపుణుల కమిటీ నివేదిక

Share with

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల జోరు పెరుగుతోంది. ప్రధానంగా ఎలక్ట్రిక్‌ బైక్స్‌, కార్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. కానీ మన దేశంలో పలు ఎలక్ట్రిక్‌ బైకులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఛార్జింగ్‌ పెడుతున్న సమయంలోనూ, ప్రయాణిస్తున్న సమయంలోనూ ఎలక్ట్రిక్‌ బైకులు దగ్ధమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. పలువురు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగడంపై కేంద్రం సీరియస్‌గా దృష్టిసారించింది. ఎలక్ట్రిక్‌ వాహనాలు ఎందుకు కాలిపోతున్నాయో తెలుసుకునేందుకు ఓ నిపుణుల కమిటీని నియమించింది. తాజాగా నిపుణుల కమిటీ అధ్యయనం జరిపి ఓ నివేదిక రూపొందించింది. బ్యాటరీ, షార్ట్‌ సర్క్యూట్‌ వల్లనే చాలా ప్రమాదాలు జరిగాయని కమిటీ గుర్తించింది. సెల్ఫ్‌ వెంటింగ్‌ మెకానిజంలో తీవ్రస్థాయి లోపాలు ఉన్న విషయాన్ని గమనించింది. అంతే కాదు, నాణ్యత లేని వాహనాలు విక్రయించాయంటూ 3 కంపెనీలపై భారీ జరిమానా విధించాలని ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.