బెంగుళూరులో జరగబోయే మ్యాచ్లో ధోని ఆడతారా..?
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇప్పుడు ఓ భయం పట్టుకుంది. ఎందుకంటే చెన్నై టీమ్ కెప్టెన్ ధోని మోకాలి గాయంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని చెన్నై టీమ్ సీఈఓ అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ గాయం కారణంగానే ధోని ఎక్కువ పరుగులు చేయలేకపోతున్నారని కూడా ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో చెన్నై టీమ్ సభ్యులు,క్రికెట్ అభిమానులు ఆందోళన పడుతున్నారు. అయితే సోమవారం చెన్నై టీమ్ బెంగుళూరులో మ్యాచ్ ఆడాల్సివుంది. దీంతో ఈ మ్యాచ్ ధోని ఆడతాడా? లేదా అని చెన్నై టీమ్లో,క్రికెట్ అభిమానుల్లో సందేహం నెలకొంది. ఈ సందేహలన్నింటికి ఫుల్స్టాప్ పెడుతూ..చెన్నై టీమ్ సీఈఓ ఓ కీలక ప్రకటన చేశారు. అదేంటంటే సోమవారం జరగబోయే మ్యాచ్లో ధోని ఖచ్చితంగా ఆడతాడని ఆయన స్పష్టం చేశారు. అలాగే మరో స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ ఈ నెల 30న పంజాబ్ కింగ్స్తో జరగబోయే మ్యాచ్కు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.