Andhra PradeshHome Page Slider

గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం -ఆరుగురు మృతి

Share with

గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు సమీపంలో ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. ప్రయాణీకులతో ఉన్న ఒక ట్రాక్టర్ బోల్తా పడింది. ఒక ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని అంటున్నారు. ఈ ట్రాక్టర్ పంట కాలువలోకి దూసుకుపోయింది. వీరంతా చేబ్రోలు మండలం జూపూడికి వెళ్తున్నారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా మరో ముగ్గురు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. ఈ సమయంలో ట్రాక్టర్‌లో 40 మంది ప్రాయాణిస్తున్నారు. వారిలో 20 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.