Andhra PradeshHome Page Sliderhome page slider

బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించిన బాలకృష్ణ దంపతులు

ఏపీలోని హిందూపురంలో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వార్షికోత్సవం ఘనంగా జరుగుతోంది. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసి 85 ఏళ్లు గడిచిన సందర్భంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇటీవల రెండున్నర కేజీల బంగారంతో తయారు చేసిన వాసవీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి బంగారు పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.