కాంగ్రెస్లో చేరిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ తనయుడు అమిత్
కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీప్ దాస్ మున్షి సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నల్గొండ జిల్లాలో పార్టీ తరపున ఎన్నికైన మాజీ మంత్రి, ఏకైక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో గుత్తా అమిత్ ఇబ్బందిపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన పట్ల అసంతృప్తిగా ఉండటంతోపాటుగా, జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఉంటే బెటరన్న భావనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గుత్తా అమిత్ చేరిక, కాంగ్రెస్ పార్టీకి బలాన్నిస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన కేడర్ ఉన్న గుత్తా కుటుంబ సభ్యుల చేరిక కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్నిస్తోందన్న భావన ఉంది. ఇప్పటికే నల్గొండ పార్లమెంట్ విషయంలో క్లారిటీతో ఉన్న ఆ పార్టీ భువగిరిలోనూ జెండా ఎగురేయాలని భావిస్తోంది.