మరోసారి మోడీ గెలిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది: కిషన్ రెడ్డి
తెలంగాణ: మరోసారి మోడీ గెలిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడమే కాకుండా మైనార్టీల ఆత్మగౌరవాన్ని పెంచింది మోడీనే అన్నారు. ఆయన హయాంలోనే రామ మందిర నిర్మాణం సాకారం అయ్యిందన్నారు.