Home Page SliderNational

ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ

Share with

తెలంగాణాలో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చెయ్యడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె గత రెండు వారాలుగా ఈడీ కస్టడీలోనే ఉన్నారు. అయితే ఈ రోజు ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసినట్లు తెలుస్తోంది. కాగా డాక్టర్లు ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టులో కవితకు బెయిల్ వస్తుందా..?రాదా..? అనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో సీఎం పదవిలో ఉండి అరెస్ట్ అయిన తొలి వ్యక్తిగా కేజ్రివాల్ నిలిచారు.