హనుమకొండలో బీజేపీ నిరుద్యోగ మార్చ్-హాజరైన ఈటల రాజేందర్, బండి సంజయ్
హనుమకొండలో TSPSC పేపర్ లీకేజ్కు వ్యతిరేకంగా నిరుద్యోగమార్చ్ను నిర్వహిస్తోంది బీజేపీ. ఈ రోజు సాయంత్రం కాకతీయ యూనివర్సిటీ నుండి ఈ మార్చ్ ప్రారంభం అవుతుంది. బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు ఇక్కడికి పెద్దసంఖ్యలో చేరుకుంటున్నారు. బీజేపీ చీఫ్ బండిసంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇప్పటికే హనుమకొండకు చేరుకున్నారు. కరీంనగర్ నుండి వచ్చే వాహనాలను ఇప్పటికే దారి మళ్లించారు. రోడ్లన్నీ కాషాయరంగు పులుముకున్నట్లు తయారయ్యాయి. డోలు డప్పులతో వాద్యకారులు కూడా హుషారుగా మార్చ్ను ఉత్సాహపరుస్తున్నారు.