ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య కన్నుమూత
బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య పరమపదించారు. మధ్యాహ్నం కమలాపురం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈటల మల్లయ్య 104 ఏళ్ల పాటు జీవించారు. మల్లయ్యకు ఎనిమిది మంది సంతానం. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. రాజేందర్ రెండో కుమారుడు. మల్లయ్య మృతితో కమలాపుర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. మల్లయ్యను కడసారి చూసేందుకు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు తరలివస్తున్నారు.