జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ చంద్రబాబు
ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం చంద్రబాబు మీడియాతోమాట్లాడుతూ చట్టవిరుద్ధంగా తమ వాహనాన్ని పోలీస్స్టేషన్లో పెట్టారని తమ వాహనాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. జగన్లో భయం పుట్టుకొచ్చిందని ఓటమి భయంతో తప్పుడు కేసులు పెట్టి అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోలీసులు ముందుకు రావాలన్నారు. తప్పు ఎవరు చేసినా సరిదిద్దుకోవాలని సూచించారు. తెలుగుజాతి కోసం త్యాగాలు చేసిన పార్టీ టీడీపీ అని చెప్పుకొచ్చారు. 5 కోట్ల మంది బాధపడుతుంటే శాడిస్ట్ సీఎం ఆనందపడతారని వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరైనా నేరస్తులే అని డీఎస్పీ ప్రజలకు సర్వెంటా వైసీపీ కా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని జడ్జిల పైనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై పోలీసులు అక్రమ కేసులు పెడితే తాము కూడా పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతామన్నారు. కుటుంబాలు ఎలా బాధపడతాయో పోలీసులకు తెలియజేస్తామని తెలిపారు. పోలీసులు ఆలోచించాలని 5 కోట్ల మందికి సహకరిస్తారా శాడిస్ట్ సీఎం పక్కన ఉంటారా అని ప్రశ్నించారు. ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని సీఎం జగన్ పనైపోయిందని ఇంటికి పోతారని అన్నారు. జగన్కు ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. కుప్పంలో ప్రభుత్వం రౌడీల రాజ్యం తేవాలని చూస్తోందని, రౌడీ రాజ్యాన్ని అణచివేస్తామని శాంతిభద్రతలు కాపాడని పోలీసులు ఖాకీ బట్టలు వేసుకున్న నేరస్తులని వ్యాఖ్యానించారు.

