Andhra PradeshHome Page Slider

యువగళంలో లోకేష్‌తో బ్రాహ్మణి, దేవాన్ష్, మోక్షజ్ఞ కలిసి నడిచారు

Share with

యువగళం పాదయాత్ర 3 వేల కి.మీ.ల మైలురాయిని పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైలాన్‌ను ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద పైలాన్ ఆవిష్కరణ కార్రక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోకేష్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హాజరయ్యారు. పెద్దయెత్తున తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.