Home Page SliderTelangana

కొమ్మ చిగురించి.. కాయ కాసింది..

Share with

గాలి వానలకు చెట్టు కొమ్మ విరిగిపోయింది. అయినా మోడు చిగురించి గుత్తులుగా కాయలు కాసింది. ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన మోదాల గంగయ్య పొలంలో విరిగిపోయి ఎండిపోయిందనుకున్న మామిడి చెట్టు కొమ్మ మరల బతికి చిగురించింది. ఆ చిగురే మామిడికాయల రూపంలో దర్శమిచ్చాయి. ఏకంగా 55 కాయలు ఒకేచోట కాసి చూపరులను ఆకట్టుకుంటోంది.