డీఎంకే కుటుంబ రాజకీయ పార్టీగా మారింది: ప్రధాని మోడీ
తమిళనాడులో డీఎంకే చేస్తున్న కుటుంబ రాజకీయాల వల్ల.. యువత ముందుకెళ్లే అవకాశం లేకుండా పోయిందని ప్రధాని మోడీ విమర్శించారు. రాష్ట్రంలోని వెల్లూరులో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. డీఎంకే ఒకే ఫ్యామిలీకి చెందిన సంస్థగా మారిందని ఆరోపించారు. డీఎంకే తమిళనాడును పాత ఆలోచనలు, పాత రాజకీయాల్లో బంధించాలనుకుంటోంది. ఈ కారణంగా యువత ముందుకు వెళ్లే అవకాశం లేదు అని తెలిపారు.