Breaking NewsHome Page SliderNationalNews AlertTrending Today

విద్యార్థుల ఘటనకు షానే బాధ్యుడు: రాహుల్

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ‘చలో పార్లమెంట్’ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలకు అమిత్ షానే బాధ్యత వహించాలని ఆరోపిస్తూ, ఆయనను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర విచారణ జరపాలని కోరారు. ఒకవేళ పోలీసుల చర్యలకు అమిత్ షా ఆదేశాలు ఇచ్చి ఉంటే ఆయన బాధ్యుడని, తెలియక జరిగితే ఆయన అసమర్థుడని వ్యాఖ్యానించారు.

లోక్‌సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కూడా రాహుల్ ఆరోపించారు. స్పీకర్‌ను పలుమార్లు కోరినా అవకాశం కల్పించలేదని, అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని షరతు విధించారని తెలిపారు. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో అమిత్ షా చిత్రాన్ని ప్రదర్శించిన రాహుల్, విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలకు ఆయనే కారణమని మరోసారి ఆరోపించారు.