NationalNews Alert

ఎన్టీఆర్ తనయ నందమూరి ఉమా మహేశ్వరి ఆత్మహత్య  

Share with

నందమూరి వారి ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ చిన్నకూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం జుబ్లీహిల్స్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇటివలే ఆమె తన కూతురి వివాహాన్ని  ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు, నారా చంద్ర బాబు నాయుడు కుటుంబ సభ్యులు హాజరై ఆమెను ఆశీర్వదించారు. చాలా గ్యాప్  తర్వాత దగ్గుబాటి పురందేశ్వరి, నారా చంద్రబాబు నాయుడు ఒకరినొకరు కలుసుకున్నారు. ఇంతలో ఈ దుర్వార్తతో నందమూరి వారి ఇంట విషాదం నెలకొంది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఉమా మహేశ్వరి నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. ఉమా మహేశ్వరి ఆకస్మిక మృతిపై విదేశాల్లో ఉంటున్న నందమూరి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కారణంగా ఉమా మహేశ్వరి చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.