మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించిన డీకే అరుణ
మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత, డీకే అరుణ నామినేషన్ దాఖలు చేశారు. పాలమూరులో ఈసారి గెలిచి తీరాలని ఆమె గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలోనే ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీజేపీలో కీలక నాయకురాలిగా ఉన్న ఆమె ఈసారి తెలంగాణలో బీజేపీ అద్భుత విజయాలు నమోదు చేస్తోందని దీమా వ్యక్తం చేశారు. పాలమూరు ప్రజలే ఆత్మీయులుగా, ఈ గడ్డ అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగుతున్నానని ఆమె చెప్పారు. అభివృద్ధి ప్రదాత ప్రధాని మోదీ స్ఫూర్తిగా బిజెపి తరఫున పాలమూరు ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.