Andhra PradeshHome Page Slider

కావలి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రామిరెడ్డి ప్రతాపరెడ్డి

Share with

కావలి వైసీపీ అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సతీమణి ఆదిలక్ష్మితో కలిసి వైస్సార్సీపీ నాయకులతో కలిసి ఈరోజు RDO కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు గారికి , మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ప్రజల ఆశీస్సులతో వరుసగా మూడోసారి కావలి నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తానని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమానికి ఎండని సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరుకావడం పట్ల ప్రతాపకుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.