Andhra PradeshHome Page Slider

జీవో 1 పై త్వరగా తేల్చండి : హైకోర్టుకు సుప్రీం సూచన

బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ పార్టీలు ర్యాలీలు ధర్నాలు జరపడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 1 పై ఏపీ హైకోర్టు త్వరగా విచారణను ముగించి తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. జీవో నెంబర్ 1పై జనవరి 24న విచారణ ముగించిన ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును వాయిదా వేసింది. దీంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. జీవో ఒకటిపై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి మూడు నెలలు దాటిందని తద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలపై తీవ్ర ఆంక్షలు పెడుతూ భావ ప్రకటన స్వేచ్ఛకు ఆటంకాలు కలిగిస్తోందని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇద్దరు వాదనలు విన్న సుప్రీంకోర్టు దీనిపై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని ఆశ్రయించాల్సిందిగా పిటిషనర్ కు సూచించింది.