వారిద్దరూ రిటైరైనా ఏ ప్లస్సే..బీసీసీఐ క్లారిటీ
భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ ఏ ప్లస్ గ్రేడ్లోనే కొనసాగుతారని బీసీసీఐ వెల్లడించింది. వారికి ఏ ప్లస్ సౌకర్యాలన్నీ కలిగిస్తామని, వారిద్దరూ భారత క్రికెట్లో భాగమేనని పేర్కొంది. ఏ ప్లస్ గ్రేడ్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లు కావడంతో వారు రూ. 7 కోట్ల వార్షిక ప్యాకేజీని పొందుతారని వెల్లడించింది.

