కర్నూలులో ప్రేమ పెళ్లికి యువతి బలి
కర్నూల్ జిల్లా ఇందిరా నగర్కు చెందిన పద్మావతి అనే యువతి ప్రేమ పెళ్లికి బలై పోయింది. నంది కొట్కూర్ పాత కోటకు చెందిన వినోద్ను ఐదేళ్ల క్రిందటి నుండి ప్రేమించి, నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అంతలోనే అతని పెళ్లి మాత్రం మరొక వ్యక్తితో జరిగిందని తెలుసుకుంది పద్మావతి. దీనితో తీవ్రమైన మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర బాధకు గురై సూసైడ్ చేసుకుంది. గత నెల 9న వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 10 న వీరి వివాహం జరగాల్సి ఉంది. ఇంతలో అతని నిజస్వరూపం తెలుసుకున్న పద్మావతి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది.