Home Page SliderTelangana

భారత్ భవన్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్

Share with

హైదరాబాద్ శివారులోని కోకాపేటలో  సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారు. కాగా కోకాపేటలో నిర్మించనున్న బీఆర్‌ఎస్ పార్టీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ అండ్ హెచ్ఆర్డీ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు రాజకీయపరమైన అవగాహన కార్యక్రమాలు,శిక్షణ తరగతుల నిర్వహణతో పాటు వారికి సమగ్రమైన సమాచారం అందించేలా దీన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ భవనాన్ని మొత్తం 11 ఎకరాల్లో 15 అంతస్థుల్లో నిర్మించనున్నారు. ఈ భవనంలో అతిపెద్ద డిజిటల్ లైబ్రరీతో పాటు అత్యాధునిక హంగులతో కూడిన సదుపాయాలు కల్పించనున్నారు. కాగా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలతో పాటు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.