NewsTelangana

‘అన్నా..ఒక్కసారి ప్రచారానికి రండన్నా’

Share with

హైదరాబాద్, మన సర్కార్

మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి తాను వెళ్లబోనని.. కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడులో ప్రచారానికి హోంగార్డులు వెళ్లరని.. ఎస్పీలే వెళ్తారని వ్యాఖ్యానించారు. నిన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీభవన్‌లో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది . కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటేయడానికి మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నిన్న గాంధీభవన్‌కు వచ్చారు. అక్కడ పాల్వాయి స్రవంతి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వద్దకు వెళ్లి ‘అన్నా..ఒక్కసారి ప్రచారానికి రండన్నా’ అని చేతులు జోడించి కోరారు. దీంతో వెంకట్ రెడ్డి ఆమె అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించారు. ఆమె తలపై చేయి పెట్టి తప్పకుండా వస్తానని ఆశీర్వదిస్తున్నట్లు అన్నారు.