Home Page SliderTelangana

కాంగ్రెస్ తుది జాబితా, బీజేపీ నాలుగో జాబితా నేడు

Share with

బీజేపీ ఇవాళ మరో జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పుటికే మూడు జాబితాల ద్వారా అభ్యర్థుల్ని ప్రకటించిన పార్టీ ఇవాళ 23 మందితో నాలుగో జాబితా విడుదల చేయనుంది. పొత్తులో భాగంగా జనసేనకు ఎనిమిది సీట్లిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇవాళ దానిపై క్లారిటీ రానుంది. జనసేన-బీజేపీ పొత్తు, వచ్చే ఎన్నికల్లో పార్టీ లాభమా, నష్టమా అన్న చర్చ కూడా జోరందుకుంది.

మరోవైపు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తుది జాబితా విడుదల చేయనుంది. ప్రకటించిన చోట్ల ఇద్దరు అభ్యర్థుల్ని సైతం మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈనెల 10న కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జన సభను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ సభకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరవుతారు. ఇవాళ కొడంగల్ లో రేవంత్ రెడ్డి నామినేషన్ వేస్తున్నారు. ఆయన ఎల్లుండి కామారెడ్డిలోనూ నామినేషన్ వేసే అవకాశం ఉంది.