Home Page SliderTelangana

బీఆర్‌ఎస్ పార్టీకి పెద్ద షాక్

Share with

‘మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయ్యింది’ బీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలలో ఓటమితో అధికారాన్ని పోగొట్టుకుని, ఢిల్లీ మద్యం కేసులో ఇరుక్కున్న ఈ పార్టీకి వరుసగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు తలనొప్పిగా మారాయి. మరో 25 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారంటూ ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ అహంకారం వల్లే ఆపార్టీ దుస్థితి పాలయ్యిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలోనే కృష్ణా జలాలు ఏపీకి అధికంగా తరలి పోయాయని, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా అంతగా పోలేదని మండిపడ్డారు. కేసీఆర్ వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, తెలంగాణ అప్పుల పాలయ్యిందని ఆరోపించారు.