ఏపీలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ, ఒక ఘట్టం ముగిసింది.!
ఏపీలో ఎన్నికల ప్రక్రియ గురువారం 3 గంటలకు ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయినట్టుగా అధికారులు తెలిపారు. ఏపీలోని 25 లోక్ సభ స్థానాలకు 731 మంది, నామినేషన్ దాఖలు చేయగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4210 మంది బరిలో నిలిచారు. శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. 29 వరకు అంటే సోమవారం వరకు ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 13న పోలింగ్ జరగనుండగా, జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.