Home Page SliderNational

కోహ్లీ సెంచరీ చేయగానే సమంత ఏంచేసిందంటే..!

Share with

భారతదేశంలో ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఐపీఎల్ అనే చెప్పాలి. ఎందుకంటే మన దేశంలో క్రికెట్‌కి ఉండే క్రేజ్ అలాంటిది మరి. అయితే సినిమా సెలబ్రీటీలు కూడా క్రికెట్ అభిమానులే. కాగా సమంత ,విజయ్ దేవరకొండ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా ఖుషీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ సమంత,హీరో విజయ్ దేవరకొండతో కలిసి స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఐపీఎల్‌లో మీకు ఇష్టమైన టీమ్,అలాగే ఇష్టమైన ప్లేయర్ ఎవరని సమంతను యాంకర్ ప్రశ్నించారు. దీనికి సమంత ఐపీఎల్‌లో తనకి ఇష్టమైన టీమ్ CSK అని,తనకు ఇష్టమైన ప్లేయర్ ధోని అన్నారు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం తనకు స్పూర్తి అని వెల్లడించారు. కాగా క్రికెట్‌లో విరాట్ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడి ,ఆ తర్వాత సెంచరీ చేసినప్పుడు తాను ఏడ్చానని సమంత తెలిపారు.