టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసులకు చుక్కెదురు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో మొయినాబాద్ పోలీసులకు చుక్కెదురైంది. బీజేపీ నేత బీఎల్ సంతోష్, తుషార్, కేరళకు చెందిన జగ్గుస్వామి, కరీంనగర్కు చెందిన న్యాయవాది శ్రీనివాస్లకు నిందితులుగా చేరుస్తూ దాఖలు చేసిన మెమో తిరస్కరణకు గురైంది. నలుగురిని నిందితులుగా చేరుస్తూ గత నెల 22న నాంపల్లి అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టులో మొయినాబాద్ పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు… మెమోను కొట్టివేసింది.