Home Page SliderInternational

క్యాన్సర్ బారిన పడ్డ వేల్స్ యువరాణి

Share with

ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కాగా సామాన్య ప్రజలతోపాటు  ప్రముఖ సెలబ్రిటీలు క్యాన్సర్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బ్రిటన్ యువరాజు విలియం భార్య,ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ కూడా క్యాన్సర్ బారిన పడినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు.ఈ మేరకు ఆమె నిన్న ఓ వీడియో విడుదల చేశారు.ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ తాను క్యాన్సర్‌ బారినపడినట్లు దానికి కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.అయితే ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని ,మరింత శక్తివంతంగా తయారయ్యేందుకు చికిత్సపై దృష్టి పెట్టానని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రజలంతా తమ ప్రైవసీని గౌరవించాలని యువరాణి కేట్ మిడిల్టన్ కోరారు. అయితే బ్రిటన్ యువరాజు విలియంకు కేట్ మిడిల్టన్‌తో 2011లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా బ్రిటన్ రాజు ఛార్లెస్-3 కూడా క్యాన్సర్ బారిన పడి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.