Home Page SliderTelangana

జడ్చర్ల: ఎమ్మెల్యే అభ్యర్థి చిత్తరంజన్ దాస్ తరఫున ప్రచారంలో ఈటల

Share with

జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చిత్తరంజన్ దాస్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.

ఎన్టీఆర్‌ని ఓడగొట్టి మంత్రి పదవి నిర్వహించిన చిత్తరంజన్ దాస్ గారు… బీసీ ముఖ్యమంత్రిని చూడడానికి మళ్ళీ ఎమ్మెల్యే కావాలి అనుకుంటున్నారు. ఆశీర్వదించండి. బీజేపీ బీసీ సీఎం చేస్తా అని ప్రకటించింది అది మనం అందిపుచ్చుకోవాలి. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశారు.

ఎరువుల మీద కేంద్రం ఇచ్చే రాయితీ తొమ్మిది వేలు. అవి ఎక్కువనా కేసీఆర్ ఇచ్చే ఐదు వేలు ఎక్కువనా? అబ్ కి సర్కార్ కిసాన్ సర్కార్ అంటూ.. మన రాష్ట్ర రైతులను పట్టించుకోకుండా పక్క రాష్ట్రం రైతులకు ఇవ్వడానికి మీ అబ్బ జాగీరా?

మీరు బీజేపీని ఆశీర్వదిస్తే 3,100 రూపాయల వరికి మద్దతు ధరను వచ్చే ఏప్రిల్ నుండి అందించే జిమ్మేదార్ నాది. కేసీఆర్ రేషన్ కార్డులే కాదు.. రేషన్ బియ్యం కూడా ఇవ్వడం లేదు.

బీజేపీ దోచుకోవడానికో, దాచుకోవడానికో రాలేదు. నరేంద్రమోదీ లాంటి వ్యక్తి గొప్ప పాలన అందించడానికి మన బీజేపీని గెలిపించి తీరాలి. ఆకలికి, పేదరికానికి కారణం ఈ కేసీఆర్ ప్రభుత్వమే.. తాగి తాగి చచ్చిపోకుండా ఉండాలంటే కేసీఆర్ పోవాలి. బీజేపీ కార్యకర్తలు నిజాయితీగా పనిచేస్తారు. కమిట్‌మెంట్‌కు కొదవలేదు. అధికారం మనదే.