Home Page SliderTelangana

బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి తరఫున ప్రచారంలో ఈటల

Share with

మహబూబ్‌నగర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్.

తెలంగాణ ప్రజలు ఈసారి కేసీఆర్‌కి కర్రు కాల్చి వాతపెడతారు. కేసీఆర్ పార్టీని బొందపెట్టాలని తెలంగాణ ప్రజల మనోగతం, అన్ని పార్టీలను చూశాం, ఇక చూడాల్సింది బీజేపీ పార్టీ మోడీని అని ప్రజలు అనుకుంటున్నారు.

ఈ గడ్డమీద వికసించేది కమలం పువ్వు. భూములు ఆక్రమించుకోవడం కోసం కాదు. మిథున్ ఎమ్మెల్యే అవుదాం అనుకునేది దౌర్జన్యం చెయ్యడం కోసం కాదు ఓటు వెయ్యమని, అదీ పెన్షన్ ఇవ్వకపోవడానికి కేసీఆర్ అబ్బ సొమ్ము కాదు, జాగీరు కాదు. మంత్రుల కారు తిరగడానికి కూడా మనం డబ్బులు కట్టాలి. మన డబ్బుకు కేసీఆర్ కాపలాదారుడు మాత్రమే. కాపలా కుక్కలా ఉంటా అన్న కేసీఆర్ ఇప్పుడు నేనే ఓనర్ అంటున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు., పెన్షన్లు వాళ్ల వాళ్లకు ఇప్పించుకున్నారు తప్ప పేదవారికి ఇవ్వలేదు.

బీజేపీ వస్తే పేదలందరికీ ఇస్తాం. కేసీఆర్ రేషన్ కార్డులు ఇచ్చే సోయి లేదు. బియ్యం కూడా బంద్ పెట్టాడు. 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తా అని ఇవ్వలేదు. భర్తలు చనిపోయి రెండేళ్ళు అయినా పెన్షన్లకు దిక్కులేదు.. కేసీఆర్ తాళం వేసుకున్నారు. కేసీఆర్ నీకు దమ్ముంటే పెన్షన్లు ఇచ్చి ఓటు అడుగు.

బీజేపీ వస్తే ముసలివాళ్ల ఇద్దరికీ పెన్షన్ ఇస్తాం. కేసీఆర్ పోతేనే పెన్షన్లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఉచిత సిలెండర్ వస్తాయి. కేసీఆర్ తెలవకుండా కొడతాడు. రెండు నెలలకు వచ్చే కరెంటు బిల్లు నెలకే వస్తోంది. తెలంగాణను అప్పులకుప్పగా మార్చాడు. పుట్టే ప్రతి బిడ్డమీద లక్షా 20 వేల రూపాయలు అప్పు ఉంది. తెలంగాణ బాగుపడాలా లేదా అనేది మీ చేతుల్లో ఉంది. మిథున్ రెడ్డికి ఓటు వేస్తే నాకు వేసినట్టే. ఆయన గెలిస్తే నేను గెలిచినట్టే. నిర్భయంగా ఓటు వేయండి.

ధర్మం శాశ్వతం… ఈ నడమంత్రపు సిరి కాదు.