ఈ ఎన్నికల్లో ధర్మానికి, అధర్మానికి పోటీ: వైఎస్ షర్మిల
ఏపీ: వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ను ఎందుకు కేటాయించాడో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు చెప్పాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కోరిన జగన్, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు వద్దన్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ధర్మానికి, అధర్మానికి మధ్యే పోటీ అని, అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వెయ్యాలని కోరారు.