Home Page SliderTelangana

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా దొరికిన విదేశీ బంగారం

Share with

శంషాబాద్ విమానాశ్రయంలో కిలోకు పైగా ఉన్న విదేశీ బంగారాన్ని కస్టమ్స్ నిఘా విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం ధరలు ఆకాశాన్ని అంటడంతో బంగారం స్మగ్లింగ్ బాగా పెరిగిపోయింది. ఇంతకు ముందు అడపాదడపా కస్టమ్స్ దాడులలో పట్టుబడే బంగారం ఇప్పుడు తరచూ శంషాబాద్ విమానాశ్రయంలో లభ్యం అవుతోంది. బంగారంపై టాక్స్‌లు బాగా పెరిగిపోవడంతో కాస్త బంగారాన్ని విదేశాల నుండి తెచ్చినా బాగా లాభం పొందవచ్చని వ్యాపారులు ఆశపడుతున్నారు. ముందుగా సమాచారం అందడంతో ఈరోజు తెల్లవారు జామున దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుల వద్ద తనిఖీలు చేపట్టారు. ఒకరి వద్ద 840 గ్రాములు, మరొకరి వద్ద 233 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. మొదటి ప్రయాణికుడు ముద్దరూపంలో బంగారం తీసుకొని వస్తుండగా, రెండవ ప్రయాణికుడు బిస్కెట్ల రూపంలో చేప నూనె డబ్బాల మధ్య పెట్టి తీసుకొని వస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.