Home Page SliderNational

కర్ణాటకలో ఒకేరోజు సభలు నిర్వహించనున్న కాంగ్రెస్,బీజేపీ

Share with

కర్ణాటకలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. కాగా మే 10 న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ప్రచారాలు చేసేందుకు ప్రత్యర్థి పార్టీలు పోటిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో  ఈ నెల 9వ తేదిన ప్రధాని మోదీ,కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సభలు జరగనున్నాయి. దీంతో ప్రస్తుతం ఇది కర్ణాటక రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే షెడ్యూల్ ప్రకారం రాహుల్ గాంధీ ఈ నెల 5న సభ నిర్వహించాల్సి ఉంది. కాగా కొన్ని అనివార్య కారణాల వల్ల దానిని ఈ నెల 9కి వాయిదా వేశారు. కాగా అదే రోజు మైసూరులో జరిగే ప్రాజెక్ట్ టైగర్ స్వర్ణోత్సవాలకు మోదీ హాజరుకానున్నారు. ఈ పరిణామాలతో కర్ణాటక రాజకీయం ఎలా మారుతుందో వేచి చూడాల్సివుంది.