TSPSC పేపర్ లీకేజీ నిందితురాలు రేణుకకు బెయిల్
ఇటీవల కాలంలో తెలంగాణాలో TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న రేణుక రాథోడ్కు తాజాగా బెయిల్ మంజూరు అయ్యింది. నాంపల్లి కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అయితే రెండు రూ.50,000 పూచికత్తులు సమర్పించాలని ,ప్రతి సోమ,బుధ,శుక్రవారాల్లో సిట్ ముందు హాజరు కావాలని,పాస్పోర్ట్ సమర్పించాలని షరతులు విధించింది. రేణుక అనారోగ్యంతో బాధపడుతుండడం,మహిళ కావడం,దర్యాప్తు చివరి దశలో ఉన్నందు వల్ల ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరుపు న్యాయవాధి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు రేణుకకు బెయిల్ మంజూరు చేసింది.