Home Page SliderTelangana

మంత్రి పదవి ఆశిస్తే స్పీకర్ పదవి వచ్చింది…గడ్డం ప్రసాద్

Share with

తాను మంత్రి పదవి ఆశిస్తే స్పీకర్ పదవి వరించిందని కొత్త స్పీకర్ గడ్డం ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం నాడు అసెంబ్లీ స్పీకర్‌గా నామినేషన్ వేస్తానని పేర్కొన్నారు. ఇకపై జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో పాలక, ప్రతిపక్షాలకు సమానంగా పాల్గొనే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సమన్యాయం చేసే పార్టీ అనీ, ఎవరిపైనా పక్షపాతం చూపదని, తగిన పదవులిచ్చి గౌరవిస్తుందని పేర్కొన్నారు. తనకు ఈ స్పీకర్ పదవి కేటాయించడం చాలా సంతోషంగా ఉందని, తన పదవికి తగినట్లు గౌరవంగా వ్యవహరించి, మంచి పేరు తీసుకువస్తానని తెలియజేశారు.