Breaking NewscrimeHome Page SliderTelangana

సీఎం రేవంత్‌తో తుర్కియే దేశ రాయ‌బారి

సీఎం రేవంత్ రెడ్డితో తుర్కియే(పూర్వ‌పు ట‌ర్కీ) దేశ రాయబారి ఫిరాట్ సునెల్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన కార్య‌క్ర‌మంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , హైదరాబాద్‌లోని తుర్కియే ఎంబసీ కాన్సులేట్ జనరల్ ఎల్మన్ ఓహన్ , ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తోన్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను తుర్కియే రాయబారి ఆసక్తిగా తెలుసుకున్నారు.ప‌లు విషయాల‌పై కూలంక‌షంగా చ‌ర్చించారు. నూత‌న ఇండ‌స్ట్రియ‌ల్ పాల‌సీ,మెట్రో విస్త‌ర‌ణ‌, ఐటి పార్కుల ఏర్పాటు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు.