NationalNews

ఆ మహిళల ఇళ్లల్లో 50 కోట్ల నగదు, 5 కిలోల బంగారం

Share with

కోల్‌కతాలోని అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన రెండో ఫ్లాట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్వహించిన సోదాల్లో సుమారు 29 కోట్ల నగదు, ఐదు కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కుంభకోణంపై తవ్వొకొద్దీ సాక్షాలు బయపడతున్నాయ్. కోల్‌కతాలోని బెల్ఘరియా ప్రాంతంలోని అర్పితా ముఖర్జీ ఇంటి నుంచి 18 గంటల పాటు సాగిన సోదాలు ముగించుకుని 10 ట్రంక్‌ల నగదుతో దర్యాప్తు సంస్థ అధికారులు వెళ్లిపోయారు. ముఖర్జీ రెండో ఫ్లాట్‌లో పట్టుబడిన నగదు ఎంత అనేది తెలుసుకోవడానికి ED అధికారులు మూడు నోట్ల లెక్కింపు యంత్రాలను ఉపయోగించారు.

పార్థ ఛటర్జీ, అర్పితా ముఖర్జీని జూలై 23న అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత అర్పితా ఇంట్లో మొదటి నగదును ఈడీ కనుగొంది. గత వారం జరిగిన దాడిలో, దర్యాప్తు ఏజెన్సీ అధికారులు నగరంలోని అర్పితాకు చెందిన పలు ఫ్లాట్ నుండి 21 కోట్ల నగదు, భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని, 2 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో కీలక ఆధారాలున్న 40 పేజీల నోట్లతో కూడిన డైరీని కూడా వారు కనుగొన్నారు. ఇప్పటివరకు, అర్పితకు రెండు ఇళ్ల నుండి 50 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగాల కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుపై ED దర్యాప్తు జరుపుతోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేబినెట్‌లోని సీనియర్ మంత్రి, సన్నిహితంగా ఉండే పార్థ ఛటర్జీ విద్యా మంత్రిగా ఉన్నప్పుడు అనేక అక్రమాల్లో ఆయన ప్రమేయంపై విమర్శలు రేగాయ్.

మంత్రి పార్థ తన ఇంటిని, మరో మహిళ ఇంటిని మినీ బ్యాంకుగా ఉపయోగించుకున్నారన్నారు. పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మాజీ అధ్యక్షుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యను కూడా దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. ఛటర్జీ అరెస్టుపై ప్రతిపక్షాల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న మమతా బెనర్జీ గత వారం తాను అవినీతికి మద్దతు ఇవ్వబోనని… అరెస్టయిన మంత్రిని దోషిగా తేలితే శిక్షించాలన్నారు. దోషిగా తేలితే శిక్షించాల్సిందేనన్నారు. ఏదైనా దురుద్దేశపూరిత జరిగే విచారణలను ఖండిస్తానన్నారు. నిజం బయటకు రావాలని… గడువులోపు విచారణ పూర్తి చేయాలన్నారు మమత.