ప్రభుత్వ ఉద్యోగులపై వైరల్ అవుతున్న ఆ వార్తలు అవాస్తవం
ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సోషల్ మీడియా లో జరుగుతున్న అవాస్తవ ప్రచారాన్ని జి.ఎ.డి అధికారులు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఎవరైనా ఇబ్బందుల పాలు చేసినా, అసభ్యకరంగా మాట్లాడినా, దురుసుగా ప్రవర్తించినా, ఉద్యోగి విధులకు అటంకం కలిగించినా, ఉద్యోగులపై చేయి చేసుకున్న, IPC సెక్షన్ల క్రింద చర్య తీసుకోబడును అనే విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని జి.ఎ.డి అధికారులు వివరణ ఇచ్చారు.