Andhra PradeshHome Page Slider

వైసీపీలో చేరిన భారత మాజీ క్రికెటర్

Share with

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాగా టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇవాళ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కండువా కప్పి అంబటి రాయుడిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అంబటి రాయుడు మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..రాజకీయాల్లో నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానన్నారు.అయితే  వైసీపీ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా మొదటి నుంచి తనకి సీఎం జగన్‌పై మంచి అభిప్రాయం ఉందన్నారు. ఏపీలో కుల,మతాలతో సంబంధం లేకుండా సీఎం జగన్ రాజకీయాలు చేస్తున్నారని అంబటి వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్రంలో జగన్ పాలన చాలా పారదర్శకం అని అంబటి రాయుడు ప్రసంశించారు.