NewsTelangana

రక్తం కళ్ళజూసిన కర్కశ కేసీఆర్‌ ప్రభుత్వం

Share with

పోడు భూములకు పట్టాలు ఇవ్వమని కేంద్రం చెప్పినా ఇవ్వకుండా బూటు కాళ్ళతో తన్ని.. రక్తం కళ్ళజూసిన కర్కశ ప్రభుత్వం కేసీఆర్‌ ప్రభుత్వమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం, రాందాస్‌ నాయక్‌ తండాలో ఎన్నికల ప్రచారంలో ఈటెల రాజేందర్‌ పాల్గొన్నారు.  ఆయన ప్రచారంలో మాట్లాడుతూ… గిరిజనుల రిజర్వేషన్‌ ఇవ్వకుండా కేంద్రం మీద నెపం పెట్టి 9 సంవత్సరాలు నిరుద్యోగులను నష్టపరచారన్నారు. ప్రస్తుతం మునుగోడు ఎన్నికల కోసం ప్రకటన చేశారన్నారు. గుడుంబా వల్ల ప్రాణాలు పోతున్నాయి అని తెలిసి కూడా కేసీఆర్‌.. ప్రతి వంద మందికి ఒక బెల్ట్‌ షాప్‌ పెట్టి లక్షల మంది చావుకు కారణం అవుతున్నారన్నారు.  మునుగోడు ప్రజల ఆశీర్వాదం ఉంటే పేదల కోసం ఎంత దాకా అయినా కొట్లడతానని ఈటల భరోసా నిచ్చారు. ఆ కొట్లాట కోసం రాజగోపాల్‌రెడ్డి కూడా తోడయ్యారన్నారు. రాజగోపాల్‌ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించి పంపండి అని ఓటర్లను కోరారు.