Home Page SliderTelangana

పోలీసులపై దాడి కేసులో షర్మిలకు బెయిల్

Share with

నిన్న లోటస్‌పాండ్ వద్ద పోలీసులపైనే చేయి చేసుకున్న కేసులో వైఎస్‌ఆర్‌టీపీ నాయకురాలు షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆమెకు ఈ కేసులో ఊరట లభించింది. చంచల్ గూడ జైలులో ఉన్న ఆమెను విడుదల చెయ్యొచ్చంటూ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. షరతులతో కూడిన 30 వేల రూపాయలతో పాటు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో బెయిల్‌ను మంజూరు చేశారు. ఇక విదేశాలకు వెళ్లాలంటే మాత్రం కోర్టు అనుమతి ఉండాల్సిందేనని కండిషన్ పెట్టింది కోర్టు.