విజయ్ దేవరకొండను ఉద్దేశించి సమంత ఆసక్తికర ట్వీట్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ,హీరోయిన్ సమంత జంటగా ఖుషీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.కాగా ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని పాట చిత్రీకరణలో భాగంగా విజయ్ దేవరకొండ,సమంత తుర్కియేలో ఆడిపాడుతున్నారు. చిత్రీకరణ సమయంలో కొంచెం విరామం దొరకడంతో వీరిద్దరు కలిసి లంచ్కు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోను సమంత తన ట్విటర్లో షేర్ చేశారు. “నీ ఉన్నత స్థాయిని చూశా,ఎత్తుపల్లాలను చూశా..ఎటువంటి పరిస్థితుల్లోనైనా కొందరు స్నేహితులు మనతోనే ఉంటారు” అని విజయ్ను ఉద్దేశించి సమంత ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ కాస్త వైరల్గా మారింది. హీరో విజయ్ దేవరకొండ,హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఖుషీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నా రోజా నువ్వే సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.