ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డి
మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నియామకం అయ్యారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సైతం ఆ జాబితాలో ఉన్నారు. ఈమేరకు మొత్తం 40 మందితో ఉన్న లిస్టును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. నవంబర్ 20న మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి.