బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదు:సీఎం స్టాలిన్
తమిళనాడు మంత్రి సెంథిల్ కుమార్ను ఈడీ మనీలాండరింగ్ కేసులో తాజాగా అరెస్ట్ చేసింది. కాగా అరెస్ట్ చేసే సమయంలో సెంథిల్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మంత్రి సంథిల్ కుమార్ను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ..ఈడీ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. తాము నమ్ముకున్న సిద్ధాంతపరంగా బీజేపీపై పోరాటాన్ని కొనసాగిస్తున్నామన్నారు. ప్రస్తుతం మంత్రి సెంథిల్ అరెస్ట్పై కూడా న్యాయపోరాటం చేస్తామని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు.