Andhra PradeshHome Page Slider

ఇప్పుడే ఎన్నికలు అన్నట్లుగా మంత్రులు కష్టపడాలి:సీఎం జగన్

Share with

ఈ రోజు ఏపీలో సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం జగన్ మంత్రులకు కీలక సూచనలు చేశారు. కాగా వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రులందరు ఇప్పుడే ఎన్నికలు అన్నట్లుగా కష్టపడాలని సీఎం మంత్రులకు పిలుపునిచ్చారు. అయితే ఈసారి ఏపీలో సాధారణం కంటే 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందన్నారు. కాబట్టి ఇప్పటివరకు మనం పడిన కష్టం ఒక ఎత్తు..ఈ కొన్ని రోజుల కష్టం మరో ఎత్తు అని సీఎం జగన్ తెలిపారు. ఈ ఎన్నికలకు మనమంతా క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పని చేయాలని సీఎం జగన్ మంత్రులకు ఆదేశించారు.