Home Page SliderNational

‘కేరళ స్టోరీ’ ఓటీటీలో ఆలస్యానికి కారణం వివరించిన హీరోయిన్

Share with

కేరళస్టోరీ హీరోయిన్ అదా శర్మ ఈ చిత్రం ఓటీటీ విడుదల విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఈచిత్రం తాజాగా 50 రోజులు థియేటర్ ప్రదర్శన పూర్తి చేసుకుంది. ఈరోజుల్లో థియేటర్లలో వారానికే ఎంత పెద్ద హీరో చిత్రం అయినా తీసేస్తున్నారు. కానీ ఒక చిన్న చిత్రం పెద్ద సినిమాలతో పోటీపడి 300 కోట్ల రూపాయల పై చిలుకు వసూలు చేయడమే కాకుండా అన్ని రోజులు థియేటర్స్‌ లో ఆడుతోందంటే ఇది చాలా గొప్ప విషయం. సినీ పరిశ్రమ మొత్తం పండుగ చేసుకోవాల్సిన సందర్భం. కానీ సినీ పరిశ్రమ తమపై కక్ష కట్టిందని, అందుకే ఓటీటీ రైట్స్ కొనడానికి ఎవరూ ముందుకు రాలేదని చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్ గుప్తా వ్యాఖ్యానించారు. అయితే హీరోయిన్ అదాశర్మ సమాధానం మరోలా ఉంది. థియేటర్లలో సినిమా ప్రసారం ఆగిపోయాక ఓటీటీకి ఇస్తారని ఆమె పేర్కొంది. ఏ ఓటీటీకి ఇవ్వాలనో దానిపై ఆలోచిస్తున్నారేమో అన్నారు. మంచి సంస్థ నుండి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారని, తప్పకుండా ఓటీటీ రిలీజ్ ఉంటుందని తెలియజేశారు.