Home Page SliderPoliticsTelangana

కేసీఆర్‌ శ్రీరంగనీతులు… నోరు విప్పితే దొంగ హామీలు

Share with

కేసీఆర్‌ ప్రసంగం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. సీఎం కేసీఆర్‌పై మరోసారి ధ్వజమెత్తారు. మహబూబాబాద్‌లో కేసీఆర్‌ ప్రసంగంపై విమర్శలు గుప్పించారు. గడీ దాటి నీ అడుగు బయటపడితే అక్రమ అరెస్టులు… నీ నోరు విప్పితే దొంగ హామీలు అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కర్లేని కాళేశ్వరం విషయంలో మొండిగా ముందుకెళ్లి.. కట్టిన మూడేళ్ళకే మునిగిందన్నారు. అందినకాడికి కమీషన్లు దండుకున్నారని మండిపడ్డారు. నీ పాలనలో తెలంగాణ దూసుకెళుతోంది అభివృద్ధిలో కాదు దొరా.. అప్పులు, ఆత్మహత్యల్లో దూసుకెళుతోందన్నారు. ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీ ఒక్కటైనా నెరవేర్చారా? అని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణను అప్పుల పాలుజేసి.. పోలీసులను పనోళ్లలా వాడుకుంటూ.. అక్రమ కేసులు బనాయిస్తున్నారని షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని దొర.. శ్రీరంగనీతులు చెబుతున్నాడు ఎద్దేవా చేశారు.