Andhra PradeshHome Page Slider

సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, సీతారామంజనేయులుపై ఈసీ వేటు

Share with

ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఈసీ బదిలీ చేసింది. ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఇద్దరినీ తక్షణమే విధుల నుంచి తప్పించాలని ఆదేశించింది. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని స్పష్టం చేసింది. డీజీ పీఎస్సార్ ఆంజనేయులపై ఇప్పటికే ఈసీకి అనేక ఫిర్యాదులు అందాయి. ఇద్దరి స్థానంలో కొత్త వారిని నియమించాలని ఈసీ ఆదేశించింది. ఇంటెలిజెన్స్ చీఫ్, బెజవాడ సీపీగా ఎవర్ని నియమించాలనే అంశంపై రేపు మధ్యాహ్నాం 3 గంటల్లోగా ప్రతిపాదనలు పంపాలంది ఈసీ. ఒక్కో పోస్టుకు ముగ్గురు అధికారుల పేర్లను ప్రతిపాదిస్తూ జాబితా పంపాలని సూచించింది. ప్రతిపాదిత అధికారులకు చెందిన గత ఐదేళ్ల కాలంలోని పనితీరు నివేదికలు, విజిలెన్స్ క్లియరెన్సులను పంపాలని ఈసీ ఆదేశించింది.