Andhra PradeshHome Page Slider

జనసేనకు గాజు గ్లాస్ కామన్ సింబల్ ఖరారు

Share with

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ జనసేనకు ఊరట లభించే నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి కామన్ సింబల్ గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసింది. ఈసీ ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. గాజు గ్లాసును గతంలో ఫ్రీ సింబల్ గా ఖరారు చేయడంతో వివాదం రాజుకుంది. ఏపీలో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులు 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, 2 పార్లమెంట్ స్థానాల్లోనూ పోటీ చేస్తు్న్నారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తోండగా, ఆ పార్టీ నేతలు పలు జిల్లాల్లో పొత్తులో భాగంగా బరిలో నిలిచారు.